Cinema Poster Designing Opening Shortly... For Ads Contact: [email protected] AndhraPradesh +919949736353 Karnataka +919902676715 |
|
|
విద్యాభ్యాసం | |||||||
|
రాజకీయాలు | |||||||||||||||||
|
కీలక ఘట్టాలు | |||||||
|
సృష్టికర్త ప్రతి మనిషికీ ఓ బాధ్యత అప్పగించి ఈ భూమ్మీందికి పంపిస్తాడంటారు. నా నుంచి ఏం పనులు చెయించాలనుకున్నాడో మరి ..రాజారెడ్డి, జయమ్మ దంపతుల కడుపులో వేశాడు. జమ్మలమడుగు మిషనరీ ఆసుపత్రిలో 1949 జూలై 8వ తేదిన పుట్టాను. నా దృష్టిలో..అమ్మ, నాన్న కనిపించే దేవుళ్ళు. తర్వాత స్ధానం ఉపాద్యాయుడిది. నా జీవితాన్ని మలిచిన
గురువు పేరు వెంకటప్ప మాస్టారు. ఆయన దృష్టిలో చదువంటే పుస్తకాలోక్కటే కాదు..వ్యక్తిత్వానికి విలువలకూప్రాణమిచ్చే మనిషాయన. వెంకటప్పమాస్టారి భార్య కొండమ్మ కూడా టేచరే... ఇద్దరు నన్ను సొంత కొడుకులా చూసుకున్నారు. ఉద్యోగాలకి రాజీనామా చేసి మాతోనే ఉన్నారు.
ఆ దంపతులకి పిల్లల్లేరు. మేమే సర్వస్వం. అంత గొప్ప గురువు దొరకడం నా అదృష్టం. ఇక విద్యార్ధి దశని తలుచుకోగానే...గుల్బర్గాలోని మా మహదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజే గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో స్కిన్ టైట్ గొట్టాల ప్యాంటులో హీరోలా వెలిగి పోయే వాణ్ని, నా అభిమాన హేరో మాత్రం ఎన్.టి.ఆర్(NTR)! నా ఫ్రెండు రామచంద్రరావు రోజుకో డబ్బా క్యాప్'స్టన్ సిగరెట్టు ఊదిపడేసేవాడు. అబ్బే! నాకు మాత్రం అలవాటు రాలేధు. ఎంతసేపూ జిమ్ముకెళ్ళడం, బరువులెత్తడం, ఇస్త్రీ డ్రస్సుల్లో షికార్లు కొట్టడం, కాలేజి పాలిటిక్సూ...అదే మన ప్రపంచం..! మూడో ఏడాది కాలేజి స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంటుగా కూడా చేశాన్లెండి. అప్పుడు జరిగిన ఓ సంఘటన బాగా గుర్తుంది. గుల్బర్గా మెడికల్ కాలేజిలో మొదటి నుంచి తెలుగువాళ్ళే ఎక్కువ. క్లాసులో వంద మంది విద్యార్ధులు ఉంటే తొంబై ఎనిమిది మంది మనవాళ్ళే. నేను చేరే సమయానికి కన్నడిగులూ ఎక్కువయ్యారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. ఒకసారి...పెద్ద పరీక్షలు ఇంకా వారం రోజుల్లో మొదలవుతాయనగా మన తెలుగు విద్యార్ధిని అక్కడి వాళ్ళు బాగా కొట్టారు. దాంతో మేం వెళ్ళి దాడిచేశాం. కాలేజి వాళ్ళూ విచారణ మొదలుపెడితే, నేనే విద్యార్దులందరిని కూడగట్టి వాళ్ళని చితకబాదానని చేప్పేశాను. దీంతో నెల రోజులు సస్పెండ్ చేశారు. ప్రొఫెసర్లతో సహా అందరూ ఎందుకలా చెప్పావు. నీ స్టేట్మెంట్ తప్ప వేరే సాక్ష్యమే లేదు. ఇప్పుడు పరిక్షలు ఎలా రాస్తావు అని కోప్పడ్డారు. నాకు అబద్దాలు చెప్పే అలవాటు లేదు. ఆ పరిణామాలు ఎంత భయంకరంగ ఉన్నా సరే లెక్కచేయను. ఇది నా తత్వం. అదృష్టవశాత్తు ఆ ఏడాది పరీక్షలు సరిగ్గా నెల రొజులు వాయిదా పడ్డాయి. అలా పరీక్షలు వ్రాయ గలిగాను. నిజానికి కట్టుబడి ఉంటే దేవుడు మన పక్షాణ ఉంటాడని అప్పుడు నాకు అర్ధమైంది. అక్కడ చదువు అయిపోగానే తిరుపతిలో హౌస్ సర్జన్సీ చేశాను. వెంటనే పెళ్ళి. విజయలక్ష్మి నా జీవితంలో ప్రవేశించింది. మొత్తం ముగ్గురు మహిళలు నా జీవితాన్ని మలిచారు. మా అమ్మ జయమ్మ, నా శ్రీమతి విజయ లక్ష్మి, నా కూతురు షర్మిల. |
|
వెన్ను చూపని యోధుడు ! మడమ తిప్పని ప్రజా నాయకుడు! ఓటమి ఎరుగని మగధీరుడు, ప్రజల నాడి తెలిసిన రాజకీయ వైద్యుడు! ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే శ్రామికుడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే..పేదల పాలిట దేవుడు. ఆయనే యెడుగూరి సందిటి రాజశేఖర్ రెడ్డి. ఆప్తులకు, అభిమానులకు ఆయన వై.ఎస్సార్! అడిగిన వారికి లేదనరు. నమ్మిన వారిని పొమ్మనరు. జనంలో నుంచి ఎదిగారు, జనం కోసం బతికారు, జనం కోసమే బయలు దేరారు, మాటలో సూటిదనం, నడకలో చురుకుదనం, నడతలో ముక్కుసూటిదనం..ఆయన సొంతం. సాహసమే ఆయన పధం. కడప గడ్డపై పుట్టిన ఆ బిడ్డ అంధ్రప్రదేశ్ ప్రజలకే ముద్దు బిడ్డగా ఎదిగారు. |
తొలి అడుగు....(ఓటమి ఎరుగని ఏకైక నేత) | |
జనం అరోగ్య సమస్యలు తీర్చిన ఆ వైద్యుడు..అదే జనం సమస్త సమస్యలు తీర్చేందుకు నాయకుడిగా మారారు. 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1978లో 29 ఏళ్ళ ఆ నవయువకుడు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1980-83 మధ్య మంత్రిగా పని చేశారు. 1983లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం వీచిన..పులివెందులలో వై.ఎస్ నిలిచి గెలిచారు. ఈ యువ శక్తిని ఇందిరాగాంధి గారు అప్పుడే గుర్తించారు. ఆయనను అంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటి అద్యక్షుడిగా నియమించారు. వందెళ్ళకు పైగా చరిత్ర ఉన్న ఓ పార్టీని..వై.ఎస్ 34 ఏళ్ళ వయసులనే నడిపించారు.కష్ట కాలంలో ఉన్న పార్టీకీ కొండంత అండగా నిలిచారు. నాయకుడిగా ఉంటూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపారు. అధికార పక్షాన్ని హడలెత్తించారు. అసమ్మతి స్వరం వినిపిస్తూ స్వపక్షంలోనూ విపక్షనేతగా ఉన్నారనే ముద్ర కూడా వేయించుకున్నారు. పదవి ఏదైన ప్రతీసారి తన సామర్ధ్యం నిరూపించుకున్నారు. | |
పాదయాత్ర రూపంలో ప్రజలలోకి ప్రస్ధానం 2003 లో తెలుగుదేశం వరుస విజయాలతో అప్పటికే కాంగ్రేస్ నీరసించింది. వరుస కరువలతో ప్రజానికం విలవిలలాడుతుంది. అదే సమయంలో విపక్ష నేతగా ఉన్న వై.ఎస్ ఓ వినూత్నమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే..'ప్రజా ప్రస్ధానం'. ప్రజల్లోకి ప్రస్ధానం. ప్రజల్లోకి స్వయంగా వెళ్ళి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన కాలినడక ప్రయాణం. ఎర్రటి ఎండలను ఎదిరించి, మట్టి దారిలో, డొంకరోడ్డులో, తారురోడ్డుపై పంచె బిగించి, తల పాగ కట్టి ఆయన ముందుకు కదులుతుంటే అడుగడుగునా జననిరాజనాలే! కరువుతో దెబ్బతిన్న ప్రాంతాల్లో విస్తృతంగా చేపట్టిన ఈ పాదయాత్ర 2004 ఎన్నికల్లో కాంగ్రేస్ కు విజయం చేకూర్చుంది. ఈ యాత్రలో 68 రోజులు పాటు 11 జిల్లాల పరిధిలోని 1470 కిలోమిటర్ల అవిశ్రాంతంగా కాలినడక పయనించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. |
ప్రస్థానం జరిగిన తీరు | |
తొలివారం..2003 ఏప్రిల్ నుంచి 15 వరకు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో 159 కి.మీ. రెండవ వారం..ఏప్రిల్ 16 నుంచి 22 వరకు మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 160 కి.మీ. మూడవ వారం..ఏప్రిల్ 23 నుంచి 29 వరకు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 181 కి.మీ. నాలుగోవారం..ఏప్రిల్ 30 నుంచి మే 3 వరకు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 170 కి.మీ. ఐదోవారం..మే 7 నుంచి 13 వరకు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 166 కి.మీ. ఆరోవారం..మే 14 నుంచి మే 29 వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 103 కి.మీ. ఏడోవారం..మే 21 నుంచి 27 వరకు తూర్పు గోదావరి జిల్లాల్లో 95 కి.మీ. ఎనిమిదో వారం..మే 28 నుంచి జూన్ 3 వరకు తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 156 కి.మీ. తొమ్మిదోవారం..జూన్ 4 నుంచి 10 వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 166 కి.మీ. పదోవారం..జూన్ 11 నుంచి 15 వరకు శ్రీకాకుళం జిల్లాల్లో 144 కి.మీ. మండు టెండ సైతం లెక్కచేయకుండా 56 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 1470 కి.మీ. పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. చెవేళ్ళలో బయలుదేరి 64 రోజుల్లో 1470 పైగా కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. వై.ఎస్ అప్పుడు జనహృదయాలను గెలిచారు. ఆ మరుసటి సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీని గెలిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు ఒక్క రుపాయ్ ఫీజు తీసుకొని రుపాయి డాక్టరుగా పేరొందిన వై.ఎస్ ముఖ్యమంత్రిగా మారి ఆ ఒక్క రుపాయి కూడ తీసుకోకుండ రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. కరువు కష్టాలకు ప్రాజెక్టులే పరిష్కారమని తలచి జలయజ్ఞం చేపట్టారు. |
ప్రజా సంక్షేమమే శ్వాసగా.. | |
వై.ఎస్ జననేత, వారికేం కావాలో ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలు ఆయనకు తెలుసు. వాటిని ఎలా తీర్చాలో కూడా ఆయనకు తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించారు. ప్రజా సంక్షేమమే శ్వాసగా పరిపాలన సాగించారు. అరకొరగా పధకాలను అమలు చేయడం కాకుండా సంతృప్తి స్దాయిలో అందరికి అన్నీ ఇవ్వాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగారు. |
ఉచిత విద్యుత్ ఫైలు పై తొలి సంతకం | |
ప్రజల సమస్యలను పూర్థి స్దాయిలో తెలుసుకునేందుకు ఆరేళ్ళ క్రిందట ఆయన ప్రజాప్రస్ధానం పేరిట పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 1470 పైగా కిలోమిటర్ల కాలినడక తిరిగి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే వాటిని నెరవేర్చేందుకు, ప్రజల సంక్షేమానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెసిన వెంటనే తొలి సంతకం ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ ఫైలుపై సంతకం చేసారు. తొమ్మిదేళ్ళపాటు కరువుతో అతలాకుతలమైన రైతన్నలకు అభయ హస్తం అందించారు. సాగు చేసుకోవడంలో రైతన్నలకు ఏ మాత్రం భారం కల్పించకూడదనే ఉద్దేషంతో ఉచిత విద్యుతును అందించదమే కాకుండ విద్యుత్ బకాయిలను మాఫి చేసారు. ప్రధాని వ్యతిరేకించినా, అధినేత్రి వారించినా ఈ పధకాన్ని ప్రవేశబెట్టి ఏడుగంటల పాటు ఉచిత విద్యుతును అందించారు. అంతెనా..రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత తొమ్మిది గంటలపాటు ఇస్తామంటూ ఎన్నికల ముందు హామి ఇచ్చి మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే దానిపై సంతకం చేసారు. అప్పటికే వడ్డీ వ్యాపరుల రుణ భారంతొ ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలను ఆదుకునేందుకు చట్టాల్లో మార్పులు చేశారు. |
రైతన్న కోసం జలయజ్ఞం | |
తొమ్మిదేళ్ళ కరువు నేర్పి పాఠాలతోనే ఆయన జలయజ్ఞంకు శ్రీకారం చుట్టారు. సముద్రంలోకి వృధాగా పొతున్న నీళ్ళను ఒడిసి పట్టి రిజర్వాయర్లలో నిలిపితే కరువు సమయంలో రైతన్నలకు అదుకొవచ్చనే ఉద్ధేశ్యంతో వేల కోట్ల రూపాయలతొ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. దశల వారిగా దానిని విస్తరించి లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 81 ప్రాజెక్టులను నిర్మించి కోటీ ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగ ప్రాజెక్టుల నిర్మాణానికి నడుం కట్టారు. పాతికేళ్ళుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్న పధకాల్లోను జీవం కల్పించారు. ఇప్పటికే 13 ప్రాజెక్టులు పూర్తి చేశారు. మరెన్నో నిర్మాణంలో ఉన్నాయి కూడా.. |
అభాగ్యులకు అండగా.. | |
ఇక, ఏ ఆసరా లేని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎందరో పాదయాత్ర సందర్భంగా తమ గోడును వై.ఎస్ కు వినిపించారు. చాలీచాలని ఫింఛనుతో అయినవాళ్ళ ఆదరణ కోల్పొయీ జీవచ్చవాలుగా బ్రతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి అభాగ్యులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతోనే భారిగా ఫించన్లు ఇచ్చారు. మొత్తాన్ని రూ.200కు పెంచారు. వికలాంగుల ఫించను మొత్తాన్ని సుమారు రు.500ల కు చేశారు. నెలనెలా ఫించను ఇచ్చే ఎర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మందికి ఫించను పథకాన్ని విస్తరించారు. |
I am Naresh,
I am studying apiiit,
My village Nellore